భద్రాచలం : మార్చి 11 శ్రీ శ్రీ కళావేదిక అధ్వర్యంలో మార్చ్ 12 ,13 తేదీలలో అంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెం లో నిర్వహించే ప్రపంచ తెలుగు కవితోత్సవ కవిసమ్మేళనం కు సంబంధించి బ్రోచర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్ల్లా కార్యవర్గ అధ్వర్యంలో భద్రాచలం ట్రాఫిక్ SI శ్రీపతి తిరుపతి ఆవిష్కరించారు .ఈ సంధర్భంగా తెలుగు భాషాభివృద్ధికి శ్రీశ్రీ కళావేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం ఆన్నారు .ప్రపంచ రికార్డు దిశగా 24 గంటల 24 నిమిషాల 24 సెకెన్ల పాటు కవి సమ్మేళనం నిర్వహించటం ప్రశంసనీయం అన్నారు .శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు తోటమల్ల ప్రధానకార్యదర్శి లక్ష్మణ్ కుమార్ చర్ల ,కార్యదర్శి తిరుమలరావు పామరాజు ,గ్రీన్ భద్రాద్రి నాయకులు కడాలి నాగరాజు లు మాట్లడారు .శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కార్యవర్గం నిర్వహించే కార్యక్రమం లో
అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ జాతీయ అధ్యక్షులు కొల్లి రమావతి ,జాతీయ కార్యవర్గం చిట్టె లలిత ,ఆరవెల్లి నరేందర్ ,మిరప మహేష్ ,మామిడాల శశిరేఖ లు పాల్గొంటారని తెలిపారు .సాహితీ వేత్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు .
Post A Comment: