మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలంలోని
కాశినాగరం గ్రామంలో ఏర్పాటైన ఏవిఎస్పి సమావేశంలో మల్లు దొర మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్ హాస్పిటల్ లో ఏ ఎన్ ఎం గా పనిచేస్తున్న దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫ రాధ అనే 22 ఏళ్ల యువతిని గిరిజనేతరుడు అయిన భద్రాచలంలో ఓ టీవీ ఛానెల్ లో పనిచేసే శేఖర్ ఆమెను వేధించసాగాడు ఆ యొక్క వేధింపులకు తట్టుకోలేక ఎనిమిదో తారీఖున ఆ యువతి నివసిస్తున్న రూమ్లో చున్నీతో ఉరి వేసుకొని చనిపోయిందని అన్నారు.ఆదివాసీల పట్ల ఆదివాసీ మహిళల పట్ల ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిపై ప్రభుత్వం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆదివాసి యువతులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే శేఖర్ ను కష్టడిలో తీసుకుని రాధా కుటుంబాన్ని కి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు..
Post A Comment: