మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆదివారం మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ సమావేశం ఈసం యాదయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య హాజరై మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసి హక్కుల కోసం వారి అస్తిత్వం కోసం పోరాటం చేయాలని అన్నారు. అదేవిధంగా ఏజెన్సీ చట్టాలను కూడా పరిరక్షించుకునేందుకు తమ వంతు పోరాటం చేయాలని అన్నారు. అనంతరం ములుగు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులు గా ఈసం రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి లు గా కోర్ని బెల్లి విష్ణు,వావిలాల స్వామి,ఉపాధ్యక్షులుగా సల్ల లక్ష్మణ్,వావిలాల సాంబశివరావు,కార్యవర్గ సభ్యులుగా ఎంపెల్లి శంకర్,పరికి వేణుగోపాల్,సల్ల సాంబయ్య,కేసరి రాజు,యాసం శ్రీను లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Post A Comment: