అన్నదానానికి విరాళాలు
జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయినాధుని మందిరంలో గురువారం నాడు బాబా వారికి ఉదయం అభిషేకం అర్చనలు జరిపారు. స్వర్ణ ఆభరణాలు ధరింపచేసి హారతి పాడారు.
టి జగదీష్ కుమార్ అన్నదానానికి 15 వేలు విరాళం ఆలయ ఉపాధ్యక్షులు కొమ్మనాపల్లి ఆదినారాయణ కోశాధికారి కుంచాల రమేష్ కు అందజేశారు. దాతను శాలువాతో సత్కరించారు. ప్రసాదం అందజేశారు.
ఇవి కాక మరియు మధ్యాహ్నం అన్నప్రసాదం కి కారం వెంకటేశ్వర్లు లక్ష్మి దంపతులు, జై ఆదిత్య మాధవన్ జై అక్షజ్ మహదేవన్ చిన్నారులు మరియు కీర్తిశేషులు రేపాక లక్ష్మీ భారతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరి, అన్నదానం జరిపారు.
మధ్యాహ్నం 550 మంది భక్తులు బాబా వారి అన్నప్రసాదం స్వీకరించారని అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలియజేశారు. మరియు వృద్ధాశ్రమం లోని వృద్ధులకు వంద మందికి భోజనం పంపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: