CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం.కొమరారం లో మేల్కొలుపు ప్రభాత బేరి,కాగడాలప్రదర్శన

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

దేశంలో పెచ్చిరిల్లిపోతున్న సామ్రాజ్యవాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ల పోరాట చైతన్య స్ఫూర్తితో విద్యార్ధి యువకులు ఉద్యమించాలని పి డి యస్ యూ రాష్ట్ర సహయ కార్యదర్శి కాంపాటి పృధ్వీ, పివైయల్ రాష్ట్ర నాయకులు వాంకుడోత్ అజయ్ అన్నారు. ఈరోజు భగత్సింగ్ 91 వ వర్ధంతి సందర్భంగా పి డి ఎస్ యు పివైఎల్ ఆధ్వర్యంలో కొమరారం లో తెల్ల వారు జామున ఐదు గంటల నుండి 6 గంటల వరకు మేల్కొలుపు ప్రభాత బేరి చేపట్టి కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీ వై ఎల్ డివిజన్ నాయకులు దారావత్ దేవా అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో ఉక్రెయిన్ పై రష్యా సామ్రాజ్యవాద దాడులు పెరిగిపోతున్న సందర్భంలో దేశంలో కర్ణాటకలో విద్యార్థుల మెదళ్ళలో మతోన్మాదాన్ని చొప్పించి విద్యార్థులను రెచ్చగొడుతూ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న సమయంలో రోజురోజుకు పెరుగుతున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్ధి యువకులు ఉద్యమించేందుకు బిగి పిడికిలి బిగించి సామ్రాజ్యవాద,మతోన్మాద, యుద్దోన్మాద వ్యతిరేక పోరాటాల లో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంథా మండల కార్యదర్శి నాయిని రాజు డివిజన్ నాయకులు పూనెం కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పోలారం మాజీ సర్పంచ్ వజ్జ వీరభద్రం పివైయల్ మండల అధ్యక్షులు ఇస్లావత్ కోటేష్ ఇర్ప కృష్ణ, నాయకులు వాంకుడోత్ శంకర్ కాంపాటి ప్రసాద్ చొప్పదండి రాములు వెలుగు శాంతారావు బుర్ర వెంకన్న బుర్ర రాఘవులు శ్రీ రామ్ కోటయ్య శ్రీరామ్ వీరన్న జానుబాబు సీతపలప చార్లీ సమ్మయ్య తనకం సత్యం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: