CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహిళలకు సన్మానం ఒక్క మహిళా దినోత్సవం నాడే కాదు మహిళలు ఎల్లప్పుడూ మహిళలు సన్మానానికి అర్హులు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 బ్రాహ్మణపల్లి లో ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమం జరిగినది. ఈ సందర్బంగా కొమరం ధనలక్ష్మి మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదు స్త్రీ లేని ఈ ప్రపంచం ఊహించలేము, ఏ రంగం లో చూసినా స్త్రీ లు ప్రధాన భూమికను పోషిస్తున్నారు అటువంటి స్త్రీలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, జాతీయ మహిళా దినోత్సవం అని, రాష్ట్ర మహిళా దినోత్సవం అని సన్మాన కార్యక్రమం పెట్టి సన్మానం చేస్తున్నావ్., అటువంటి సన్మానం, పొగడ్తలు ఆశించి ఏ స్త్రీ పని చేయదు స్త్రీ అంటే మానవత్వం, స్త్రీ అంటే సహనం అటువంటి స్త్రీలను ఏ ఒక్క రోజు సన్మానం చేస్తే సరి పోదు అలాగని రోజు సన్మానించమని కాదు వారు చేసే పనులను గుర్తించి వారికి సమానమైన హోదా ను కల్పించండి అది ఇంటిలో కావొచ్చు సమాజం లో కావొచ్చు, ఆఫీస్ లో కావొచ్చు వారు చేస్తున్న రంగంలో కావొచ్చు.ఆకాశం లో సగం ప్రపంచం లో సగం ఉన్న స్త్రీకి సరి అయిన గౌరవం ఇప్పటికి లభించడం లేదు. అటువంటి పురుషాధిపత్య రోజులకు స్వస్తి పలికి సమానమైన గౌరవం ఇస్తే అదే నిజమైన సన్మానం అని బావోద్వేగంతో అన్నారు.ఈకార్యక్రమంలో బ్రాహ్మణపల్లి పి. హీచ్.సి.పరిధిలో ని ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు కరోనా సమయం గ్రామాలలో నీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవచేస్తునారు వీరిని ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా కప్పి ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి సన్మానించారు. ఈ కార్యక్రమం లో మహిళలు గోదా రజనీ, మూర్తల లక్ష్మి,బాప్పెన జ్యోతి,గోదా సుమా,బువన, ధనలక్ష్మి,ఉప్పలకవిత,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: