మన్యం మనుగడ కరకగూడెం: కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలని ఐఎప్ టీయు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.ఐఎప్ టీయు యూనియన్ అనుబంధ కేజీబీవీ నాన్ టిచ్చింగ్ వర్కర్స్ యూనియన్ మండల కమీటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ,కార్మికులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించాని ఆ ప్రకటన ప్రాకారం కేజీబీవీ పాఠశాల లో పని చేస్తున్న నాన్ టిచ్చింగ్ వర్కర్స్ ని అందరిని పర్మినెంట్ చెయ్యాలని కోరారు. అలాగే ఆడ పిల్లలకు ఉన్నత విద్యావంతులుగా తిర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రత్యేకమైన కేజీబీవీ పాఠశాలలు ఎర్పాటు చేసినందుకు సిఏం కేసీఆర్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టిచ్చింగ్ వర్కర్స్ టి.రజిత,పార్వతీ, సుజాత, స్వరూప, ఎస్ పార్వతీ పాల్గొన్నారు.
Post A Comment: