చండ్రుగొండ, మన్యం మనుగడ ప్రతినిధి: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య ఆరోపించారు. మంగళవారం జరిగిన తెలంగాణ రైతు సంఘం వర్క్ షాపు లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంలో సైతం ప్రధాని విఫలమయ్యారన్నారు. తరుగు పేరుతో రైతుల వద్ద నుండి కోత విధించిన ధాన్యం నగదును మిల్లర్ల వద్ద నుండి వెంటనే రైతుల అకౌంట్ కు జమ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28,29తేదీలలో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఐలూరి రాంరెడ్డి,పెద్దిని వేణు, నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: