- తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి,ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జడ్పీ చైర్మన్, ములుగు శాసనసభ్యులు, ఏటూరు నాగారం ఐటిడిఎ పివో కు వినతి పత్రాలు అందజేసిన గ్రామస్తులు.
- ములుగు జిల్లా అటవీశాఖ అధికారి స్పందించకపోవడం అవివేకం.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల ఐలాపురం గ్రామంలో కొమురం భీం యువజన సంఘం అధ్యక్షులు పీరీల సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూత్ ప్రధాన కార్యదర్శి ఆలం నగేష్ మాట్లాడుతూ.భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 5,6 వ షెడ్యూల్ ప్రాంతంతో పాటు1/70, పెసా,అటవీ హక్కుల చట్టం,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచార చట్టాలు ఉన్నప్పటికీ ఆదివాసి చట్టాలను,దొడ్డిదారి పట్టిస్తున్నారని,ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు డిఎఫ్ ఓ,ఎఫ్ డి ఓ,ఎఫ్ ఆర్ వో ల పై చట్టరీత్య చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.2021 సంవత్సరం లో మా గ్రామానికి కొండాయి గ్రామం నుండి ఐలాపురం గ్రామం వరకు మంజూరు అయిన త్రీఫేస్ విద్యుత్తు లైను పనులను,గుత్తేదారులు పనులు ప్రారంభించి స్తంభాలు వేయడం పూర్తి చేసినారు.అనంతరం వైర్లు (తీగలు) లాగుతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం అవివేకమని అన్నారు.మా గ్రామ అభివృద్ధి అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కూడా మా ఊరికి మంజూరైన రోడ్లు విషయంలో కూడా అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం జరిగిందని అన్నారు.మరలా ఇప్పుడు కూడా రోడ్డు,త్రి ఫేస్ కరెంటు మంజూరు అయినప్పటికీ అటవీశాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని అన్నారు.ఈ పనులను తిరిగి ప్రారంభించే విధంగా అధికారులు స్పందించాలని అన్నారు. పనులు ప్రారంభించిన ఎడల ఏటూరు నాగారంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని,ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లెల బాలయ్య,పోశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ ధర్మ సోత్ బాలు,మల్లెల రాఘవయ్య, గుమ్మడి రామచందర్,బొచ్చు సదానందం,వెంకటేష్,పీరీల భాస్కర్,మల్లెల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: