మన్యంటీవి,అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని... టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొండ తోగు గిరిజన గ్రామమునందు స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్ రావు అద్వర్యంలో మంగళవారం నాడు కేక్ కట్ చేసి సంబరాలు జరిపి గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి నామా నాగేశ్వరరావు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి జన్మదిన వేడుకలను గిరిపుత్రుల మహిళల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేంద్ర పరిధిలో నుండి సాధించడానికి టిఆర్ఎస్ పక్షాన పార్లమెంటు నందు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించిన మంచి మనసున్న నేత నామా అని తెలిపారు. టిఆర్ఎస్ కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఆదుకుంటూ ముందుకు సాగుతున్న మంచి మనసున్న మహారాజు అని వారన్నారు. నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు తరఫున పేదసాదలకు అనేక సహాయ సహకారాలు అందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత వారికే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావు పేట ఎంపీపీ శ్రీరామ్మూర్తి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, అశ్వారావు పేట నియోజకవర్గ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గిరిపుత్రులు, మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: