మన్యం మనుగడ, కరకగూడెం:
ఏఐసీసీ, పీసీసీ మరియు డీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ధరలను వెంటనే తగ్గించాలని గ్యాస్ సిలిండర్ కి దండ వేసి మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అధిక ధరలతో సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతున్నారన్నారు.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్,నిత్యావసర ధరలు పెంచినట్లు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిత్యం వాడుకునే వంటగ్యాస్ ధరల పెంపుతో ఇంట్లో మహిళలు చాలా బాధ పడుతున్నారని ఆయన తెలిపారు.
అదేవిధంగా విద్యుత్ చార్జీలు పెంచినందున రైతులు,సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇప్పటికైనా పెంచిన టువంటి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు మరియు విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
లేనియెడల కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంది పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల బీసీ సెల్ అధ్యక్షులు బైరి శెట్టి రామారావు, మండల కార్యదర్శి షేక్ రఫీ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: