ములకలపల్లి:మార్చి13:(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
మండలంలోని సీతాయియిగుడెం గ్రామ పంచాయతీ, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొరస ప్రేమ్ సాగర్(38)పాస్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా,వారి కుటుంబాన్ని వైఎస్ ఆర్ టిపి నియోజక వర్గ నాయకులు హై కోర్ట్ న్యాయవాది పెనుబల్లి రమేష్ బాబు పరామర్శించారు.సంవత్సర కాలం వ్యవధిలోనే తల్లి,తరువాత తండ్రి చనిపోవడంతో పాప,బాబు అనాధాలయ్యారు.ఈ సందర్బంగా పిల్లలను సందర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. యాభై కేజీల బియ్యము,ఐదు వెయిలు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. భవిష్యత్తులో వైఎస్ఆర్ టిపి పార్టీ నుండి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టిపి నాయకులు ఉకే వెంకటేశ్వరరావు,కాకా రమేష్,సోయం సునీల్ కుమార్,కోడిమే వంశీ,ఉకే నీలరాజు,పద్దం లక్ష్మణ్ రావు, గ్రామస్తులు మడి వెంకటేశ్వరరావు,కోడిమే వెంకట్ వి.కృష్ణ,తాటి రోహిత్,తేజ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: