- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
ములకలపల్లి:మార్చి11:(మన్యం మనుగడ)న్యూస్:
అర్హులైన లబ్ధిదారులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలో గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో ట్రైకార్ రుణాల కొరకు ధరఖాస్తు చేసుకున్నరని, లాటరీ పద్ధతి లో ఎన్నికైన లబ్ధిదారుడికి ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో గామ పంచాయతీల పరిధిలో 2 లక్షల లోపు ఉన్న లబ్ధిదారులను లాటరీ పద్దతిలో ఎంపికైన లబ్ధిదారులను బ్యాంకర్లు, నిరాశకు గురి చేస్తున్నారని అన్నారు. 10 లక్షల లోపు ఉన్న లబ్ధిదారులను ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపిక చేసి బ్యాంకర్స్, ఎంపీడీవో, అర్హులైన లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తున్నారని అన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపికైన లబ్ధిదారునికి ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని లేనియెడల ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొడియం వెంకటేశ్వర్లు, దుబ్బ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, కుంజా రామ్మూర్తి, మాజీ సర్పంచ్ గడ్డం వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: