CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి : సున్నం నాగమణి.

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 24 ) గురువారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం దమ్మపేటలో చిలకా శ్రీను ఇంటి దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దిశెట్టి సత్య ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది .ఈ సమావేశానికి సున్నం నాగమణి జెడ్పీటీసీ ములకలపల్లి మరియు టీపీసీ మెంబర్ హాజరైనారు .ఈ సమావేశాన్ని ఉద్దేశించి సున్నం నాగమణి మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు 12% పెంపుపై బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు నాటకలాడుతూ గిరిజనులును మోసం చేస్తున్నారని సున్నం నాగమణి ఆరోపిస్తోంది .తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పార్లమెంటు సాక్షిగా గిరిజనశాఖ కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ చెప్పటం జరిగింది .గిరిజనులు రిజర్వేషన్లపై మన రాష్ట్రంలో నిరసన కార్యక్రమం కాకుండా ఢిల్లీలో చేయాలని సున్నం నాగమణి తెలియపరుస్తుంది .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ;మంత్రులంతా కలిసి ఢిల్లీలో ప్రధాన మంత్రి ఇంటి దగ్గర 12% గిరిజన రిజర్వేషన్లపై ధర్నా చేసి ఒప్పించాలని సున్నం నాగమణి డిమాండ్ చేస్తోంది .ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు చిలకా శ్రీను చిన్న శెట్టి చిట్టిబాబు కందుల వెంకటేశ్ రావు s.k.సుకుమార్ నాగబాబు కొమరం ప్రసాద్ సోయం వెంకటేశ్వర్లు మొదలగువారు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: