మన్యంటీవి, అశ్వారావుపేట: అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న ) సంస్మరణ సభనుమండల పరిధిలోని కావడిగుండ్ల గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు కుంజా భీమయ్య అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మండల కార్యదర్శి కంగాల కల్లయ్య, ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ డివిజన్ కార్యదర్శి వాసం బుచ్చిరాజు లు మాట్లాడుతూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ దేశ వ్యాప్త కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచిగా పనిచేశారని, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటినుండి నేటి వరకు ఉద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో భారత విప్లవ ఉద్యమాన్ని నడిపిన ఘనత రాయల సుభాష్ చంద్రబోస్ కే దక్కుతుందని, వారి ఆశయాల వెలుగులో సిపిఐ ఎంఎల్ ప్రజా పండ అడుగులు వేస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాడిస లక్ష్మణరావు, కావడి గుండ్ల కన్నాయిగూడెం సర్పంచులు కంగాల భూలక్ష్మి, గొంది లక్ష్మణరావు,కణితి జోగారావు, తెల్లం సత్యం, కొమరం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: