మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం గాంధీ బొమ్మ సెంటర్లో ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చర్ల పోలీసులు, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా చలివెంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఓ ఎస్ డి తిరుపతి , ఎస్పి రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో చర్ల సిఐ అశోక్ నేతృత్వంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ సుబీర్ కుమార్ మండల్ , ఎస్ ఐ లు రాజు వర్మ ,వెంకటప్పయ్య పర్యవేక్షణలో ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సి ఐ బి అశోక్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చర్ల పోలీస్ శాఖ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.నిరంతరం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ బిజీగా ఉంటూ మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చర్ల పోలీసులు, మరోసారి ఏజెన్సీ ప్రజల కోసం మానవత్వాన్ని చాటుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దానియేలు , పలువురు పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: