మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి తేజస్వి ఔదార్యాన్ని చాటుకున్నారు. పినపాక మండలం లోని టేకులగూడెం ఆదివాసి గ్రామంలో గల బాల వెలుగు పాఠశాల విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఏకరూప దుస్తులు కుట్టించి, వాటిని తనే స్వయంగా పంపిణీ చేశారు. దీనితో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామాగ్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల వెలుగు పాఠశాల ఉపాధ్యాయుడు తోలెం శ్రీనివాస్, పాయం వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అరుణ, ఉపాధ్యాయురాలు అనూష, విద్యార్థులు, టేకులగూడెం ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: