చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: సామాజిక కార్యకర్తగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సావిత్రిబాయ్ పూలే ఎనలేని కృషి చేశారని సిపిఎం మండల నాయకులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సిపిఎం మండల పార్టీ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయ్ పూలే వర్ధంతి వేడుకల్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తన జీవితం అణగారిన వర్గాల కోసం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాయి రాజా, లక్ష్మణరావు,అప్పారావు నాగేశ్వరరావు, కాకా వీరస్వామి ,నాగేశ్వరరావు తూరుపాక శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: