గుండాల మార్చి 29(మన్యం మనుగడ) కుటుంబ సభ్యులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని రోళ్ల గడ్డ గ్రామానికి చెందిన ఈసం. శ్రావణి (16) గుండాల కస్తూరిబా పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది గ్రామంలో జాతర ఉన్నందున ఇంటికి వెళ్ళింది సోమవారం కుటుంబ సభ్యులు సోమవారం మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గుండాల ఎస్ఐ దారం సురేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
Post A Comment: