ప్రజా సమస్యల పరిష్కారానికై చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించండి. ఆదివారం ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చల రంగయ్య, జిల్లా నాయకులు కెచ్చల కల్పన, నూపా భాస్కర్, కిషోర్, మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి లతో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లెందులో నాయిని రాజు, గుండాల మండలంలో మాచర్ల సత్యం, శంకర్ లతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లోనూ అరెస్టు చేశారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం, పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులను అరెస్టు చేసే ఈ ప్రభుత్వ విధానాలను ప్రజలు, ప్రజా స్వామిక వాదులు ఖండించాలని కోరుతున్నాం.
ఇట్లు,
గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమమ్మెల్యే
రాయల చంద్రశేఖర్ , ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు
పాయం చిన్న చంద్రన్న , ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు
Post A Comment: