CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిరుద్యోగ, యువజన సంఘం ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్, ఎమ్మెల్యే మెచ్చా చిత్రపటాలకు పాలాభిషేకం.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:దేశంలో ఏ రాష్టం లో లేని విధంగా తెలంగాణ రాష్టంలో ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు బుధవారం నిండు అసెంబ్లీ లో తెలంగాణ నిరుద్యోగ యువత కోసం సుమారు 91 వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల అశ్వారావుపేట నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక రింగ్ రోడ్ లోని తెలంగాణ తల్లి, విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్య మంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే మెచ్చా చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో ఇంత భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనతేనని ఉద్యమ సమయంలో నిధులు నియామకాలు అభివృద్ధి నినాదంతో తెలంగాణను తీసుకున్నామని దానికి అనుగుణంగా ఆయన ఎంతో ముందు చూపుతో ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేశారని వర్షం వ్యక్తం చేశారు దీని ద్వారా రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కలుగుతుందన్నారు వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల యువజన సంఘం ఉపాధ్యక్షులు తగరం హరి, చిప్పనపల్లి శ్రీను, గంధం ఆనంద్, శెట్టిపళ్లి రఘురాం, తగరం శ్రీను, తగరం కృష్ణ, నార్ల పాటి సునీల్, తగరం వెంకట్ , సాకుర్తి అనిల్, మహేష్, నార్లపాటి అనిల్, తెరాస పార్టీ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీపీ శ్రీరామూర్తి, మండల పార్టీ కార్యదర్శి జుజ్జూరి వెంకన్నబాబు ముబారక్ బాబా, మోటురి మోహన్, ఉపాద్యాయులు సూర్య ప్రకాష్ రావు, కలపాల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, కార్యదర్శి పసుపులేటి ఫణీంద్ర, సర్పంచ్ జ్యోత్స బాయ్, పిఏసీఎస్ అధ్యక్షులు పుల్లారావు, నార్లపటి చిన్నఅబ్బాయి, చిప్పన పల్లి బజారు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: