CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డబుల్ బెడ్ రూమ్స్, ఆసరా పెన్షన్ లను మంజూరు చేయాలి :-ప్రజా పంధా నాయకులు మాచర్ల సత్యం

Share it:

 


గుండాల మార్చి 31(మన్యం మనుగడ) రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, అర్హులైన వారందరికీ , రేషన్ కార్డులు, అర్హులైన వారందరికీ పెన్షన్స్ అందించాలని ప్రజా పంధా డివిజన్ మాచర్ల సత్యం అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి చేయడం లేదన్నారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఇప్పటి వరకు అమలు పరచ లేదన్నారు. హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలను తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమరం శాంతయ్య , ఈసం శంకరన్న, కోడూరి జగన్, పాపయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: