మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలంలో ఉపాధ్యాయుల కొరతతో మారుమూల నిరుపేద కుటుంభాలకు చెందిన పిల్లలు తమ చదువులను కొనసాగిస్తూ ఉంటే ఈ మద్యలో వచ్చిన ఉపాధ్యాయులను సంబందిత అదికారులు వర్క్అడ్జస్ట్మెంట్ డిప్యూటెషన్ మీద వేరె మండలాలకు పంపుతున్నారు.మంగపేట మండలం కోర్టులో కేసు ఉండటం వలన విద్యావలంటీర్లు కూడా లేనందున వచ్చిన ఉపాద్యాయులు వెలుతుంటె ఇక్కడి విద్యార్తుల విద్యా భవిష్యత్తు ఏమిటి బ్లాక్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు చిలుకమర్రి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన అదికారులు అక్రమ డిప్యుటెషన్స్ ఆపి అన్ని వర్గాల పిల్లలకు న్యాయం చే యాలని తెలిపారు. ఇప్పటికే తిమ్మoపేట, బుచ్చంపేట లో ఉపాద్యాయులను డిప్యూటేషన్ మీద పంపించినారని అన్నారు. ఈ అక్రమ విదానాన్ని ఆపి ఇక్కడి పిల్లలకు న్యాయం చేయాలని తెలిపారు. కార్యక్రమములో జిల్లా యస్.సి సెల్ ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, తిమ్మoపేట కాంగ్రెస్ పార్టి గ్రామ అద్యక్షులు చిన్నపెళ్లి రాంబాబు, మండల ప్రధానకార్యదర్శి మైప లాలయ్య, మండల యుత్ ప్రధానకార్యదర్శి చెట్టుపల్లి ముకుందo, తిమ్మoపేట గ్రామ మైనారిటి అద్యక్షులు యం.డి. రఫి, కిసాన్ సెల్ గ్రామ ప్రధానకార్యదర్శి ముండ్రాతి సాంబయ్య, నాయకులు పోలేబోయిన అర్జున్ రావు, కటుకోజు నాగార్జున, కొత్నాల హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: