మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామంలో వాహనదారులను మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం హెల్మెట్ లేని వాహనదారులకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వాహనాలు నడపాలని, అశ్వారావుపేట పోలీస్ సిబ్బంది నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారు, పెండింగ్ చలానాలు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి వాహనాలను నిలుపుదల చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ఉపేందర్, మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఈ మధ్యకాలంలో జరిగిన ప్రమాదాలు చూస్తే ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణాలు సంభవించాయని, వీటిలో హెల్మెట్ లేని మరణాలే ఎక్కువగా ఉన్నాయని, ప్రజల ప్రాణాలను కాపాడుకోడానికి తప్పని సరి హెల్మెట్ ధరించాలని ప్రాణాలకు విలువనిచ్చి నిబంధనల పాటించాలని వాహనదారులను సూచించారు. అదేవిధంగా పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించాలని, కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: