CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తాగునీటి కోసం ఇక్కట్లు,వేసవి వచ్చిందంటే తప్పని తిప్పలు.

Share it:

 



 ములకలపల్లి:మార్చి15:(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:

మండలంలోని జగన్నాధపురం గ్రామపంచాయతీ రేగులకుంట గ్రామం బయట వారి గుంపు, కురసం వారి గుంపు ల్లో 35 కుటుంబాలు ఉన్నాయి.ఈ రెండు గుంపులకు వేసవి కాలం వచ్చిందంటే త్రాగడానికి,నిత్య అవసరానికి వీరు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్యపై అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తెలిపిన కనీసం ఎలాంటి ప్రత్యామ్నాయ కూడా ఏర్పాట్లు కూడా చేయక పోవడం గమనార్హం.ఈ గ్రామానికి గ్రామ పంచాయతీ నుండి మోటార్ సదుపాయం ఉన్నప్పటికీ, పైన ఉన్నది పైన తెలిపిన గ్రామాలు ఎత్తులో ఉండటం వల్ల వారికి నీళ్లు అందడం లేదు.ఇదే సమస్యను సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు తెలిపిన పంచాయతీ నుండి కానీ మండలం నుండి కానీ,వారి నీటి సమస్య పరిస్కారం కోసం ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను తీరుస్తారని,మాకు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తారని అన్నారు.ఇక్కడ మాకు ఉన్న ఒక బోరు చాలా నెమ్మదిగా నీరు వస్తోందని, మా కనీస అవసరాలు తీర్చుకోవలంటే ఒకరితర్వాత ఒకరు వేచి నీరు అందుకోవాల్సి వస్తుందని, కావున శాశ్వత పరిస్కారం కోసంబైట వారి గుంపులో మోటర్ వేస్తే ఈ రెండు గుంపులు సకాలం లో నీరు అందుతది.

Share it:

TS

Post A Comment: