- ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం పర్యటనకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు వెల్లకండి.మండల అధ్యక్షులు రావుల సోమయ్య
మన్యం మనుగడ కరకగూడెం:ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పోగులేటి.శ్రీనివాసరెడ్డి, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు పర్యనకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు హాజరు కావద్దు అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అన్నారు. అయన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్పటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ,ఎమ్మెల్యే మండలంలో పార్టీప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు సమాచారం లేకుండా మండలంలో పర్యటించడం సరికాదని ఒక్క మాజీ ఎంపీ కనీసం పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి సమాచారం తెలపకుండా మండలంలో పర్యటించడం సరికాదని అన్నారు. ఒకే పార్టీలో ఉంటు కనీసం సమాచారం లెకుండా మండలంలో పర్యటించడం సరికాదని అన్నారు.ఇప్పటికైన మాజీ ఎంపీ పోగులేటి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి పద్దతి మార్చకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు, రేగా సత్యనారాయణ, బైరిచెట్టి చిరంజీవి, ఆత్మకమిటి డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,షోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్, దాసరి సాంబశివరావు, గోగు.లక్ష్మయ్య,గోగు ప్రభాకర్, భాతిని సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: