CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంచిర్యాల జిల్లా వీఆర్ఏ హత్య పై న్యాయ విచారణ చేపట్టాలి....

Share it:

 


చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసిల్దార్ కార్యాలయంలో రాత్రి వేళలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ దుర్గం బాబు హత్య పై న్యాయ విచారణ చేపట్టాలని వీఆర్ఏ సంఘం కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం తహసీల్దార్ ఉషశారదకు డిమాండ్లతో కూడిన వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ.... విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఏ ను హత్య చేయటం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా దోషులను చట్టపరంగా, కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు షేక్ మీరా, మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: