మన్యం టీవీ మణుగూరు:
పేద ప్రజలకు గొప్ప వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని,పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని జడ్పీటీసీ పొశం.నర్సింహారావు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు పట్టణంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు ఐనా చెక్కులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అని తెలిపారు.ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, మండల అధ్యక్షులు ముత్యంబాబు,కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్రావెంకట్,పార్టీ నాయకులు,యువజన నాయకులు,మహిళ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: