CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిబిజికెయస్ విజ్ఞప్తి మేర జియం కార్యాలయ ఉద్యోగులకు నూతన క్యాంటీన్ సౌకర్యం.

Share it:

  



  • ఏరియా రథ సారధి జీఎం జక్కం.రమేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన టిబిజికెయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర రావు

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా నిర్దేశించిన ఉత్పత్తి,ఉత్పాదకత లక్ష్యాలకు ఎప్పటికప్పుడు గడువుకంటే ముందుగానే అధికమించే విషయంలో, పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్న జియం కార్యాలయ ఉద్యోగులకు ప్లిడర్ క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం గా టిబిజికెయస్ ఏరియా జనరల్ మేనేజర్ జక్కం.రమేష్ ను కోరగా సోమవారం నుండి క్యాంటీన్ సేవలు అందుబాటు లోకి రావడం సంతోషకరమైన విషయమని ఈ సౌకర్యాన్ని జియం ఆఫీస్ ఉద్యోగులు సద్వినియొగం చేసుకోవాలని మణుగూరు టిబిజికెయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీఎం కార్యాలయంలో క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులందరూ పలు మార్లు గుర్తింపు కార్మిక సంఘం సృష్టికి తీసుక రావడం జరిగిందని, ఉద్యోగులందరీ కోరిక మేరకు స్ధానిక యాజమాన్యం తో మాట్లాడి నూతన క్యాంటీన్ సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. సమయ పాలన పాటిస్తూ, క్యాంటీన్ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రత్యక్ష ఉత్పత్తి,ఉత్పాదకత ప్రక్రియ లో భాగస్వామ్యం వహిస్తున్న ఏరియా కార్మికులకు మరియు రిటైర్ మెంట్ కార్మికులకు కూడ మరిన్ని సేవలు జియం ఆఫీస్ సిబ్బంది అందించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలని ఆయన కోరారు.టిబిజికెయస్ విజ్ఞప్తి మేరకు నూతన క్యాంటీన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించి అనుమతులు మంజూరు చేసిన ఏరియా రథ సారథి జీఎం జక్కం.రమేష్ కు మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి తరుఫున హృదయ పూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జియం ఆఫీస్ అధికారులతో పాటు బ్రాంచి నాయకులు వీర భద్రయ్య,కోట శ్రీనివాసరావు,జియం పి.ఏ రాంబాబు,ఇంఛార్జి ఫిట్ సెక్రటరి సీత మరియు టిబిజికేయస్ శ్రేణులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: