గుండాల మార్చి 9 (మన్యం మనుగడ) రాష్ట్రంలో ఉన్న ఒప్పంద ఉద్యోగస్తులను ను క్రమబద్ధీకరణ చేస్తాం అనడం ఆనందంగా ఉందని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కళాశాలల్లో ఎట్టి చాకిరీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటనతో విముక్తి కలిగినట్టు ఉందన్నారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాలస్వామి, సతీష్ రెడ్డి, రవీందర్ నాయక్, కృష్ణమాచారి, చైతన్య, రఘు, పద్మ, సురేష్ , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: