ములకలపల్లి:మార్చి20(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరజ్యాం మృతి పట్ల సంతాపం తెలియజేశారు.ఈ సందర్బంగా సీపీఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ,నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం భూస్వామ్య కుటుంబం పుట్టి 1945 సంవత్సరం లో నైజాం సర్కారు ను గడగడలడించిన వీర వనిత మల్లు స్వరజ్యాం అని,భూమి కోసం భూక్తి కొసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేశారని,ఆమె మృతి సీపీఎం పార్టీకి తీరని లోటునని తెలిపారు.దొరలా గడిలను బద్దలు కొట్టిన మొట్టమొదటి మహిళా నాయకురాలు అని అన్నారు. ఈకార్యక్రమంలో నిమ్మల మధు,గడ్డం వెంకటేశ్వర్లు, బీబీనేని గడ్డయ్య, శ్రీను,కణితి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: