మన్యం మనుగడ, పినపాక:
పినపాక ,కరకగూడెం మండలాలలో ఖమ్మం మాజీ ఎంపి పోంగులేటి శ్రీనువాసరెడ్డి పర్యటనకు తెరాస కార్యకర్తలు, అభిమానులు హజరూకావద్దని టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు లోని తెరాస పార్టీ కార్యలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ, తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు ,ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సమాచారం లేకుండా, పినపాక, కరకగూడెం,మండలాల్లో పర్యటిస్తున్నారని, అన్నారు.
తెరాస పార్టి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరు కూడ ఈ కార్యక్రమంలో పాల్గోన కూడదని,అన్నారు.ఈ సమావేశంలో ఎంపిపి గుమ్మడి గాంధీ,ఆత్మకమిటి చైర్మన్ పోనుగోటి భధ్రయ్య,సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మొగలపల్లి నర్సింహ రావు,ఎంపిటిసి లు కాయం శేఖర్, చింతపంటి సత్యం,ఉప సర్పంచ్ సత్యనారాయణ, తోలెం శ్రీనివాస్,గుమ్మడి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: