గుండాల మార్చి13 (మన్యం మనుగడ) ఉస్మానియా యూనివర్సిటీ లో పి డి ఎస్ యు రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో గుండాల మండలం చెట్టుపల్లి గ్రామం గ్రామానికి చెందిన ఇర్ప రాజేష్ ను రాష్ట్ర కమిటీలో కి ఎన్నుకోవడం జరిగిందని పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. అనంతరం రాజేష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అనునిత్యం పోరాడుతానని, తారతమ్యాలు లేని నవసమాజం ఏర్పాటు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలేర్షిప్ విషయంలోను, విద్యార్థుల సమస్యలపై గళమెత్తి విద్యార్థులకు అందాల్సిన సదుపాయాలు త్వరితగతిన అందేవిధంగా పాలకులకు గుర్తుచేస్తూ. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఆయన అన్నారు. పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీలో కి తీసుకున్నందుకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు
Post A Comment: