- బూత్ ఏజెంట్లకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన
- కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడు
- గద్దల రమేష్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలంతా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్ అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామాల్లో ఉన్న
బూతు ఏజెంట్లు,కార్యకర్తలు, నాయకులు,
పార్టీ సభ్యత్వం గురించి ప్రతి ఒక్కరూ మీరు ఉన్న గ్రామంలో గడపగడపకు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పాల్వంచ మండలం లోని అత్యధికంగా సభ్యత్వ నమోదు ఉండాలని అన్నారు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా రెండు లక్షలు పార్టీ కల్పిస్తుందని తెలిపారు, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అని కోరారు.
Post A Comment: