మన్యంటీవి, అశ్వారావుపేట: నూతన పిఎసిఎసి అధ్యక్షునిగా చిన్నంశెట్టి సత్యనారాయణ ఎన్నికైన సంధర్భంగా ఈరోజు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇంటివద్ద ఆయనని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్యే మెచ్చా చిన్నంశెట్టి సత్యనారాయణని శాలువాతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పిఎసిఎస్ అధ్యక్షులు చెన్నంశెట్టి సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని అని కోరారు, ప్రజలకు రైతులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ అందరికీ మేలు చేసే విధంగా నడుచుకోవాలని తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్మూర్తి, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ కార్యదర్శి జుజ్జూరి వెంకన్న, శీమకుర్తి వెంకటేశ్వర రావు, యు ఎస్ ప్రకాష్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ, లింగి శెట్టి వెంకటేశ్వరావు, తాళం సూరిబాబు, సొసైటీ డైరెక్టర్ గూడవర్తి వెంకటేశ్వరరావు, అబ్దుల్ జిన్నా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: