- టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు,చిరమల్ల సర్పంచ్ పాయం నరసింహారావు
మన్యం మనుగడ కరకగూడెం:
కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ల గ్రామ పంచాయతీలో గల చందావారిగుంపులో పోలెబోయిన నర్సయ్య ఇంటి నుండి చందా రాఘవులు ఇంటి వరకు రూ.5 లక్షలతో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పాయం నరసింహరావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతుందని అయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు, వార్డు
సభ్యులు పోలబోయిన రాజు, చందా సుజాత, మాజీ సర్పంచ్ చందా భుపతయ్య, గ్రామ పెద్ద చర్ప నరసింహారావు, చందా పరమయ్య, పోలబోయిన నరసయ్య, చందా నారాయణ,చిరుమళ్ల పంచాయతీ సెక్రటరీ పూర్ణ ఫణీంద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: