గుండాల మార్చి 31(మన్యం మనుగడ) కేంద్ర ప్రభుత్వంపై కదం తొక్కిన కాంగ్రెస్ దండు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద వర్గాలపై ధరలు పెంచి పెను భారం మోపడం పై మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ సిలిండర్లను రోడ్ల మీద ఉంచి వాటికి దండలు వేసి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మామ కన్ను సర్పంచ్ ముత్యమా చారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: