మన్యంటీవి, అశ్వరావుపేట:అశ్వరావుపేట మండలం, నారాయణపురం పంచాయతీ పరిధి పెంచికలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నబంధం రంగమ్మ 45, మహిళా కూలీ, కూలి పనుల నిమిత్తం మంగళవారం పొలానికి వెల్లాగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాను ఉంటున్న పూరిల్లు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధం కావడంతో కూలీ పనులకు వెళ్లి పైసా, పైసా కూడ పెట్టుకున్న మూడువేల రూపాయలు, వంట సామగ్రి, బట్టలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. విషయం తెలుకున్న అశ్వారావుపేట జనసేన పార్టీ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు డేగల రామచంద్ర రావు (రాము) వెంటనే స్పందించి జన సైనికులతో కలసి వెళ్లి ఐదువేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసాను నింపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల పుల్లారావు, జనసైనికులు నాగబాబు, దామేర బాబి, లింగి శెట్టి కుమార్ స్వామి పాల్గొన్నారు.
Post A Comment: