CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడమే లక్ష్యం -దిశా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట: ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడమే లక్ష్యంగా దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ పనిచేస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలు వేముల భారతి తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని నారాయణ పురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెంచికలపాడు గ్రామానికి చెందిన బంధం మంగమ్మ పూరిల్లు కాలిపోయిన సందర్భంలో వారిని పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వేముల భారతి మాట్లాడుతూ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి సహాయ కార్యాలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజన కుటుంబానికి చెందిన బంధం మంగమ్మ సర్వం కోల్పోవడం చాలా బాధ అనిపించింది అని సాయం చేసే సంకల్పంతో బియ్యం పలు వంట సామాగ్రి బట్టలు దుప్పట్లు వెయ్యి రూపాయలు నగదును అందజేయటం జరిగిందని వారన్నారు. నిరుపేద గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని వేళలా ఆదుకొని ఇంటిని మంజూరు చేయాలని కోరారు. కడుపేద కుటుంబం చూస్తే జాలేస్తుంది అని పలువురు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి దిశ ఫౌండేషన్ తరపున ప్రత్యేక అభినందనలు అని వారన్నారు. సాయం చేసే గుణం ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల దిశ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎండి రెజీనా బేగం, వేముల ప్రతాప్ పలువురు గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: