CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాయి బ్రాహ్మణ సమస్యలపై తహశీల్దార్ కు వినతి పత్రం..

Share it:

 



జూలూరుపాడు మార్చి 11, (మన్యం మనుగడ) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కడియాల సత్యనారాయణ ఆదేశాల మేరకు నాయి బ్రాహ్మణ సమస్యలపై శుక్రవారం జూలూరుపాడు మండలం తాహశీల్దార్ లూధర్ విల్సన్ కు పలు రకాల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ జిల్లా కార్యవర్గ సభ్యులు మాడుగుల నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఆర్థిక రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని, జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన వారందరికి పెన్షన్ మంజూరు చేయాలని, కళ్యాణ కట్ట దేవాలయాలలో పని చేస్తున్న వారిని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ ను ఎంపిక చేయాలని, నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారులు ఆదుకోవాలని, నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని కోరారు. విద్యార్థులకు సీట్లు కేటాయింపు, ప్రమాద బీమా వర్తింపజేయాలని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కుదురుపాక నిర్మల, మండల అధ్యక్షుడు కడియాల పుల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కడియాల మని, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి రామ్, వైస్ ప్రెసిడెంట్ మాడుగుల నరేష్, వల్లోజి సైదులు, కడియాల సత్యం, కృష్ణార్జున రావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: