గుండాల మార్చి 23(మన్యం మనుగడ) ఆదమరిస్తే అనంత లోకాలకే వెళ్లే విధంగా రహదారి. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద నుండి జి.సి.సి వరకు వెళ్లే రహదారి డ్రైనేజీ వద్ద ప్రమాదభరితంగా దర్శనమిస్తుంది. డ్రైనేజీ పై స్లాబ్ పూర్తిగా వేయకపోవడం వల్ల ఎక్కువ విస్తీర్ణం ఉండడం మూల మలుపు తిరిగే వీలు లేక పోవడంతో భారీ వాహనాలతో పాటు చిన్న వాహనాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు పాదచారులు సైతం గమనించకపోతే ప్రమాదాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన మరమ్మతులు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post A Comment: