మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం మల్లూరు గ్రామంలో హోళీ పండుగ నాడు తీవ్ర విషాదం చోటుచేసుకున్నది.ఒక యువకుడు గోదావరి స్నానాలకు వెళ్లి వ్యక్తి ప్రమాద వశాత్తు మృతి చెందాడు. వివరాల లోకి వెళితే మల్లూరు గ్రామానికి చెందిన రావుల వెంకటేశ్వర్లు కాంతమ్మల కుమారుడు రావుల కార్తిక్ (23) తన స్నేహితులతో కలిసి హోళీ సంబరాలు చేసుకున్నారు. హోళీ ఆడిన తరువాత అతని స్నేహితులు దగ్గరలో ఉన్న గోదావరికి స్నానాలకు వెళ్లి స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గోదావరి లోతులో పడి గల్లంతై మృతి చెందాడు. మృతి చెందిన కార్తిక్ కు ఇటీవలనే వివాహం జరిగింది. ఈ విషాదం చూసి తట్టుకోలేక మృతుని తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు దానితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Post A Comment: