- వ్యవసాయా కార్మిక సంఘం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు
ములకలపల్లి:మార్చి15(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
పెండింగ్ లో ఉన్న ఉఫాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు. ఉఫాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచాలని. ఉఫాధి కార్మికులకు సమ్మర్ అలివేన్సు ఇవ్వాలని,ఎండ తీవ్రతకు ఎవరైన మరణిస్తే 12 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉఫాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని. లేనియెడల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆసరా పెంక్షన్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి స్ధలం ఉన్న వారికి 5 లక్షల తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని.దళిత గిరిజనులకు మూడు ఎకారల భూమి ఇవ్వాలని,కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28,29న జరిగేసార్వత్రిక సమ్మె కు మద్దతుగా జరిగే గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో నిమ్మల మధు,తేజవత్ జగ్గు,పులి వెంకటేశ్వర్లు,పోడియం మంగయ్య, పద్దం మహేష్,శివ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: