గుండాల మార్చి 31(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సమస్యలను లేవనెత్తారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వన్ అవర్ దాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. మండలంలోని ఐసిడిఎస్ కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేదని సగానికిపైగా సెంటర్లలో టీచర్లు సమయపాలన పాటించడంలేదని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కొన్ని కేంద్రాల్లో పిల్లలకు ఇవ్వాల్సిన సరుకులను సైతం టీచర్స్ ఇవ్వటం లేదని అన్నారు. వేసవి కాలం వచ్చినందున నీటి ఎద్దడి గ్రామాలను గుర్తించి మిషన్ భగీరథ నీళ్లు క్రమం తప్పకుండా వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, జెడ్ పి టి సి రామక్క,ఎంపీడీవో హజరత్ వాలి, తాసిల్దార్ రంగు రమేష్ , భగీరథ డి ఈ పద్మావతి, ఎంపీటీసీ సంధాని, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: