CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిపిసిసి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

Share it:

 


 

 మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో అశ్వరావుపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొగళ్ల చెన్నకేశవరావు ఆధ్వర్యంలో గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, నిత్యవసర సరుకులు పెరిగిన ధరలకు నిరసనగా స్థానిక అశ్వరావుపేట మద్ది రామమ్మ గుడి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొగళ్ళ చెన్నకేశవరావు, మండల కమిటీ, జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే కరోనా విపత్తు కాలం నుండి సామాన్య ప్రజలు అనేక ఆర్థిక పరిస్థితులు ఎదుర్కుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సామాన్య ప్రజల పరిస్థితి అర్థం చేసుకోక అనేకసార్లు గ్యాస్ విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు పెంచుకుంటూ వస్తున్నారని, వెంటనే సామాన్య ప్రజల పరిస్థితి అర్థం చేసుకొని పెరిగిన గ్యాస్ విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు, మద్దిరామ గుడి సెంటర్లో గ్యాస్ బండకు పూలదండ వేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేసి స్థానిక ఏఈ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి నాయకులు తుమ్మ రాంబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బూసి పాండు, ఎంపీటీసీలు వేముల భారతి, సత్య వరపు తిరుమల, నాయకులు బానోతు మంజు నాయక్, బండారు మహేష్, సంగ ప్రసాద్, ముళ్ళ గిరి కృష్ణ, మోహన్ రావు బద్దె చిట్టయ్య ముత్తు దుర్గయ్య, తలారి జేమ్స్, భూక్య శోభన్ బాబు, చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: