CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ఏఎస్పీ కార్యాలయం భద్రాచలం.హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సన్మానించిన ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Share it:


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 102 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులలో భాగంగా భద్రాచలం సబ్ డివిజన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు ముజామిల్,శ్రీనివాసరావు, రాంబాబు లను ఈ రోజు భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్,ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ,మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు బాధ్యతలను మరింతగా పెంచుతాయని అన్నారు. క్రమశిక్షణ,నిజాయితీతో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పదోన్నతులతో పాటు ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం సిఐ నాగరాజు రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: