చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ షుకూర్ అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నిమ్స్ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. వారిది అత్యంత నిరుపేద కుటుంబం, వారి అమ్మ వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్నారు. వారి నాన్న అబ్దుల్ గఫార్ కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా కుంగిపోయిన విషయం తెలుసుకొని శుక్రవారం ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అబ్దుల్ షుకూర్ భార్యకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ షుకూర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... ఆ దేవుడు ఆశీస్సులు ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ కు ఎల్లవేళలా ఉండాలని, కుట్టు మిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో తమ జీవనోపాధిని మెరుగుపడుతుందనిన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, మండల రైతు సమితి కో ఆర్డినేటర్ గాద లింగయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమిశెట్టి సైదయ్య, యూసుఫ్, నల్లబోతుల రవి, ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గొళ్ల రమేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: