మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చి 31, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ, ఏఐసీసీ, టిపిసిసి మరియు డిసిసి పిలుపుమేరకు గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గ్యాస్ సిలిండర్ కు పూలమాలవేసి పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బానోతు మంగీలాల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లకావత్ లచ్చు నాయక్, మండల మహిళా నాయకురాలు గూగులోతు ప్రియాంక నాయక్, పెంటికల రవి, కొర్ర రవిచందర్ చౌహన్, వాంకుడోత్ కిషన్ నాయక్, గూగులోతు శ్రీను నాయక్, గూగులోతు శ్రీనివాసరావు నాయక్, లకావత్ గోవింద్ నాయక్, గూగులోతు రాంబాబు, బాదావత్ సామ్య నాయక్, ఆదినారాయణ, గూగులోతు బుల్లి, గూగులోతు రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: