మన్యం మనుగడ, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం...కరకగూడెం విద్యుత్ స్టేషన్లో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న, నాగరాజు (42 ) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, కరకగూడెం ఎస్ఐ జీ.ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నాగరాజు బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళిన అనంతరం రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించాడు. గురువారం తెల్లవారుజామున నాగరాజు మేల్కొనకపోవడంతో చుట్టుపక్కల వారు నాగరాజు లేపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాగరాజు నిద్రిస్తున్న గదికి గడప సమీపంలో 8ఫీట్స్ ల పెద్ద తాచుపాము పడుకొని ఉండడం గమనించారు. గ్రామస్తుల అలజడికి పాము పారిపోయినట్లు తెలియవచ్చింది. అనంతరం నాగరాజు ని పరిశీలించగా...నోటి నుండి బురుజు కక్కుకొని నిర్జీవంగా పడి ఉన్నాడు. సంఘటన ప్రదేశంలో తాచుపాము కనిపించడంతో పాము కాటుకు గురై మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు తరలించారు. మృతుడుది పాల్వంచ మండలం బొల్లేరుగూడెం గ్రామవాసి. మృతుడికి భార్య కమల ఉన్నారు. సహచర ఉద్యోగి అకాల మృతి పట్ల కరకగూడెం సబ్ స్టేషన్ సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగి పోయారు. .
Post A Comment: