మన్యం మనుగడ మంగపేట.
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్,యాత్ర రథసారథి డా : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 9 వ రోజు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో జరిగింది.ఈ యాత్రలో ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ,మంగపేట మండల ఇంచార్జీ ఎంపెళ్లి వీరస్వామి పాల్గొనడం జరిగింది.ఈ రోజు యాత్రలో డా :ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొలాల్లో పనిచేస్తున్న దినసరి కూలీల దగ్గరికి వెళ్లి వారి కష్టాలను,బాధలను తెలుసుకోవడం జరిగింది.ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం,ఉపాధి,కావాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీ పార్టీ ద్వారా బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని తెలియజేశారు.
Post A Comment: